తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి ..

People of Telangana should be healthy.– దత్తాత్రేయ స్వామి పూజలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీదర్ బాబు, శైలజ రామయ్య దంపతులు
నవతెలంగాణ-  మల్హర్ రావు/కాటారం
దత్తాత్రేయ నవరాత్రుల్లో భాగంగా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు,శైలజ రామయ్య దంపతులు గురువారం ప్రత్యేక పూజలు,అభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు పండ్లరసాలతో అర్చకుల వేదమంత్రాలు మధ్య అభిషేకాలను నిర్వహించారు.స్వామివారి మూలవిరాట్ కు విశేష ఉపచార పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలను సమర్పించారు.దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి దత్త హోమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులకు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.అనంతరం మంత్రి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై చూపాలని వేడుకున్నట్లు తెలిపారు.