
నవతెలంగాణ- రాయపోల్
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియాని వ్యక్తులు చేసే ఫోన్ లింక్ లు ఓపెన్ చేయవద్దని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. సోమవారం రాత్రి పోలీస్ కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులమని రుణమాఫీ వస్తుందని కరెంట్ బిల్లు కట్టాలని, కేవైసీ అప్డేట్ చేయాలని, విదేశాలలో మీ పిల్లలు ఉంటే వారి పేరు చెప్పి అక్కడ నేరం చేశారని చెప్పి మోసం కాల్ చేస్తారు. మీకు తెలియని లింకులు పంపిస్తే ఓపెన్ చేయవద్దు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంటికి ఏమైనా ఆన్లైన్ ద్వారా పార్సల్స్ వస్తున్నాయా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. యువతి యువకులను గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అట్టి వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.పోలీస్ కళా బృందం కనువిప్పు ద్వారా మూఢనమ్మకాల పై మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు, ఆత్మహత్యలు, వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రవి,రవీందర్,ఎల్లయ్య, తిరుమలయ్య, భార్గవి, రవీందర్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.