పీజీ, ఇంటిగ్రేటెడ్ మూడవ రోజు పరీక్షలు ప్రశాంతం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల పీ.జీ. మొదటి సెమిస్టర్ ( ఎంఏ, /.ఎం. కాం / ఎం. ఎస్. డబ్ల్యూ / ఎం ఎస్సి/ ఎంబీఏ./ ఎంసీఏ)  మరియు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ల ( ఏ.పి.ఈ/ ఐ.పి.సిహెచ్ / ఐఎంబీఏ/)7వ, సెమిస్టర్  రెగ్యులర్ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా ముగిసాయి. గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.సోమవారం జరిగిన పరీక్షకు ఉదయం 1911 మంది విద్యార్థులకు 1801 మంది విద్యార్థులు హాజరయ్యారు. 110 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. ఈ పీజీ  పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా  తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలంగాణ వర్సిటీ బిక్నూర్ సౌత్ క్యాంపస్,గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్, గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి,గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఆర్మూరు. ప్రభుత్వ  డిగ్రీ కాలేజ్ బోధన్  సెంటర్లలో జరుగుతున్నాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంట చంద్రశేఖర్  తెలిపారు.అయన వెంట  అసిస్టెంట్ ప్రొఫెసర్ మోహమ్మద్ అబ్దుల్ ఖావి ఉన్నారు.