దివ్యాంగులకు ఫిజియోథెరపీ పరీక్షలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని భవిత పాఠశాలలో గురువారం దివ్యాంగులకు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు.  వివిధ గ్రామాల నుంచి వచ్చిన 8మంది విద్యార్థులకు  ఫిజియోథెరపీ చికిత్సలు చేసి, ఫిజియోథెరపీ చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఫిజియోథెరపిస్టు నవీన్ సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పి.ఈ.టి హనుమంత్ రెడ్డి, ఐఈఆర్పి మహేందర్, తల్లిదండ్రులు  సునీత, బిక్షపతి ,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.