భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటలి 

Planting trees for future generations– విద్యార్థులకు దుస్తుల పంపిణీ 
– ప్రత్యేక అధికారి టి దయానంద్ 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి టి దయానంద్ తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పర్సాల పరిశుభ్రత మొక్కల పంపిణీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ బట్టలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనం పథకంలో పరిశీలించారు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందిస్తూ ఇంటి వద్ద నాటాలని వాటిని సంరక్షించాలని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సకాలంలో ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు వాతావరణ మార్పుల సందర్భంగా విష జ్వరాలు ధైర్య లాంటి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది కృషి చేయాలన్నారు. మండల స్థాయి గ్రామస్థాయి అధికారులు సిబ్బంది సమయపాలన పాటించి గ్రామాల్లో సేవలందించాలన్నారు సమయపాలన పాటించని సిబ్బంది అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  పచ్చదనం పెంచేందుకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు. పాఠశాలలో నాటిన మొక్కలను ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పకుండా వాటిని సంరక్షించ బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. పాఠశాల టీచర్లు సమయపాలన పాటించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సూర్యకాంత్, వివిధ గ్రామాల కార్యదర్శి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.