ప్లేటు ధర 12 శాతం పైకి

– ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో స్తబ్దత
న్యూఢిల్లీ : దేశంలో శాఖహారం ధరలు పెరిగాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2023 డిసెంబర్‌లో థాలీ (ప్లేట్‌) భోజనం ధర 12 శాతం భారమైందని రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌ వెల్లడించింది. మరోవైపు మాంసహార ప్లేట్‌ ధర 4 శాతం తగ్గిందని వెల్లడించింది. శాఖాహారం థాలీలో రోటీ, కూరగాయలు (ఉల్లిపాయ, టొమాటో మరియు బంగాళాదుంప), అన్నం, పప్పు, పెరుగు , సలాడ్‌ ఉంటాయి. మాంసాహార థాలీలో పప్పునకు బదులుగా చికెన్‌ ఉంటుంది. గడిచిన డిసెంబర్‌ మాసంలో ఉల్లి, టమాటా ధరలు వరుసగా 82 శాతం, 42 శాతం పెరగడంతో శాఖాహారం థాలీ ధర గణనీయంగా పెరిగిందని క్రిసిల్‌ పేర్కొంది. వెజ్‌ థాలీలో 9 శాతం వాటా కలిగిన పప్పుల ధరలు కూడా సంవత్సరానికి 24 శాతం పెరిగాయని పేర్కొంది. అధిక ఉత్పత్తి వల్ల బ్రాయిలర్‌ చికెన్‌ ధరలు 15 శాతం తగ్గుదల కారణంగా మాంసహార థాలీ ధర తగ్గిందని పేర్కొంది. మరోవైపు గతేడాది జులై- సెప్టెంబర్‌ కాలంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల్లో స్తబ్దత చోటు చేసుకోవడంతో ఆ కంపెనీల ఆదాయాల్లో యథాతథంగా నమోదయ్యాయి.