నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో జనవరి 01, 2024 నుండి జనవరి 31 వరకు ఆపరేషనర్ స్మైల్ – X కొనసాగిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనివార్, ఐ.పి.యస్ శుక్రవారం తెలియజేశారు. ఈ ఆపరేషన్ స్మైల్ ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాలోపు తప్పిపోయిన, వదిలివేయబడిన కార్మీకులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, వారితో పని చేయించిన యాజమానిపై కేసు నమోదు చేయడం కాని లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం కాని, తల్లి దండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటి (సి.డబ్ల్యూ.సి) వారికి అప్పజెప్పడం జరుగుతుంది.ఈ ఆపరేషన్ స్మైల్-X లో భాగంగా నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్లో మొత్తం 65 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో నిజామాబాద్ డివిజన్ నందు రెండవ పోలీస్ స్టేషన్ నందు ఇద్దరు యాజమానులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది. మిగిత పిల్లల్ని సి. డబ్ల్యూ.సి వారి ఆదేశాల మేరకు వారి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగింది.అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను దర్పన్ యాప్ నమోదు చేసి వారి అడ్రస్ లాను గుర్తించడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ ఆపరేషన్ స్మైల్-X లో పట్టుకున్న పిల్లల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.నిజామాబాద్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 22, ఆర్మూర్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 17, బోధన్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 21, ను గుర్తించారు.నిజామాబాదు కమిషనరేట్ పరిధిలో గుర్తించిన బాలల వివరాలు మొత్తం 65 అని తెలియజేశారు.నిజామాబాద్ సబ్ డివిజన్ లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబాలకు అప్పగించిన వివరాల సంఖ్య 22,ఆర్మూర్ సబ్ డివిజన్లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబాలకు అప్పగించిన వివరాల సంఖ్య 17,బోధన్ సబ్ డివిజన్లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబాలకు అప్పగించిన వివరాల సంఖ్య 21, అని తెలియజేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన వారి మొత్తం వివరాల సంఖ్య 65 అని తెలియజేశారు.