మారణ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Police recovered the deadly weapons– తొమ్మిది మందిపై కేసు.. నలుగురు అరెస్ట్.. ఐదుగురు పరారీలో
– కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ గౌస్ ఆలం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
అక్రమంగా తరలిస్తున్న మరణ ఆయుధాలను ఆదిలాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులో తొమ్మిది మందిపై కేసు నమోదు చేయగా నలుగురు నిందితులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అలాగే నాలుగు పిస్టల్స్, 8 మ్యాగజిన్స్, 18 రౌండ్స్ స్వాధీనం, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకై నిందితులు ఆర్థికంగా ఆయుధపరంగా దళం పునర్నిర్మాణం చేస్తుండగా జిల్లా పోలీసులు పక్క సమాచారంతో వారిని పట్టుకుని వారి ఆలోచనలను ఏర్పాటను విచ్ఛిన్నం చేయడం జరిగిందని తెలిపారు. ఏ1 గా వెంకటరెడ్డి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి అరెస్టు అయ్యారని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తన మిత్రుడి హత్య కేసుకు ప్రతీకార చర్యగా, అదేవిధంగా జనశక్తి పార్టీని తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్థాపితం చేయడానికి నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థిక సహాయం చేశారన్నారు.
ఏ1 వెంకటరెడ్డి తన అనుచరుడు ఏ3 హేమ కాంత్ రెడ్డి కలిసి ఏ2 దిలీప్ అతని రెస్టారెంట్ లో పనిచేసే భైరవ్ చెప్పిన వ్యక్తితో కలిసి కాశీకి వెళ్లి ఉండగా, వారితో వచ్చిన వ్యక్తి బీహార్ రాష్ట్రం మృంగార్ రైల్వే స్టేషన్ కు వెళ్లి పిస్టల్స్, బుల్లెట్లను సేకరించి తిరిగి కాశీకి వచ్చరన్నారు. తిరిగి వెళ్లే క్రమంలో చాంద టీ బైపాస్ రోడ్డు వద్ద పక్కా సమాచారంతో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై ముజాహిద్ మరియుసిబ్బంది కలిసి తనిఖీ చేశారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఏ2 దిలీప్ ఏ3 హిమకాంత్ రెడ్డి లు నాలుగు 7.65 ఎంఎం పిస్టల్స్, 8 మ్యాగజైన్లు, 18 లైవ్ రౌండ్ లను,  వారు ప్రయాణించిన కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామన్నారు. గురువారం రాత్రి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సూత్రధారి ఏ1 వెంకట్ రెడ్డి, పిస్టల్స్ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేసిన ఏ4 ప్రసన్న రాజుల ను గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ2 మైల దిలీప్, శ్రీశైలం రుచులు అనే రెస్టారెంట్ ఏర్పాటు అనుమతులపై తనకు పరిచయమున్న ఏ1 వెంకటరెడ్డికి సున్నిపెంట గ్రామంలో ఆదిత్య రెస్టారెంట్ యజమాని ని సహాయం కోరడం జరిగిందన్నారు. తదుపరి మైల దిలీప్ రెస్టారెంట్లో పని చేసే బీహార్ వాస్తవ్యుడైన భైరవతో బేరాన్ని ఏర్పాటు చేసుకొని, ఏ1 వెంకటరెడ్డి ఇంటి నుండి ఏ4 నల్లగంటి ప్రసన్న రాజు చేసిన ఆర్థిక సహాయంతో డబ్బులను తీసుకొని ఏ2 దిలీప్, ఏ3  హిమకాంత్ రెడ్డి, కుక్ భైరవ్ చెప్పిన వ్యక్తి సహాయంతో కాశి కి వెళ్లి అక్కడ రెండు రోజులపాటు ఉండి బీహార్ మృంగిర్ రైల్వే స్టేషన్ లో పిస్టల్స్ ను తీసుకొని ఆదిలాబాద్ మీదుగా తిరిగి వస్తున్న క్రమంలో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఏ1 వెంకట్ రెడ్డి పై ఇదివరకే టాడా కేసు, వివిధ సంఘవిద్రోవశక్తుల కేసులలో, హత్య కేసులలో కీలక పాత్రగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతనిపై మూడు హత్య కేసులు, ఒక హత్య ప్రయత్నం కేసు, నాలుగు జనశక్తి కి సంబంధించిన కేసులు,రెండు టాడా కేసులు మొత్తం 10 కేసులలో పాత్ర ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు పంపడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన  జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డి.ఎస్.పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే ఫణిదర్, కరుణాకర్, డి సాయినాథ్, ఎస్సైలు ముజాహిద్ సిబ్బంది  పాల్గొన్నారు.