పోషన్‌ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి

Potion Mahatsava should be successful– కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు అందాలని జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పోషన్‌ మహోత్సవం నిర్వహణ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన అదనపు కలెక్టర్లు సి.హెచ్‌. ప్రియాంకతో కలిసి మాట్లాడారు. గర్భిణి స్త్రీలు, బాలింతలు అలాగే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. పిల్లలకు సకాలంలో ఇమ్యునైజేషన్‌ జరిగేలా చూడాలని అలాగే పోషణ మాసోత్సవంలో భాగంగా ఈ నెల 30 వరకు షెడ్యూల్‌ ప్రకారం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం అనుబంధ శాఖల అధికారులు కలసి సమిష్టి కషి చేయాలని సూచించారు. పోషణ మాషోత్సవాలలో భాగంగా పిల్లల ఎత్తు బరువులు పరిశీలన అనంతరం తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు, వయసుకు తగ్గ ఎత్తు, బరువు లోపం ఉన్న పిల్లలను గుర్తించి, గుడ్లు బాలామతం అందేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ముక్యంగా పోషక విలువలు కలిగి ఉన్న చిరుధాన్యాల పట్ల వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అవగాహన కల్పించాలని సూచించారు .కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని జ్యోతి పద్మ పోషణ మాసంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వివరించడం జరుగుతుందని మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు తప్పక అందించాలని అలాగే ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం అందిం చడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య కరమైన పిల్లల పోటీలతో పాటు పోషణతో పాటు చదువు పై కషి చేస్తున్నామని అన్నారు. మిషన్‌ లైఫ్‌ ద్వారా పోషకాహారాన్ని మెరుగు పరచడం జరుగుతుందని వివరించారు. గిరిజన ప్రాంతాలలో పోషకాహారం పై ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందని , కిషోర బాలికలలో రక్తహీనత పై అవగాహన, రోజువారి చేపట్టే పోషణ మాస కార్యక్రమాలలో ఆశ, ఏఎన్‌ఎం, పంచాయతీ సెక్రెటరీ, స్వయం సహకార సంఘ సభ్యులు , అంగన్వాడీ టీచర్స్‌ చురుకుగా పాల్గొని సమతుల ఆహారానికి పాలు, గ్రుడ్లు చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించారు.అనంతరం అధికారులతో కలిసి పోషణ్‌ మా గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్‌ డి ఎఫ్‌ డి కిరణ్‌ కుమార్‌ , డీఏఓ రామారావు నాయక్‌ , డిఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌ , మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యాపేట రామానుజుల రెడ్డి, డీఈవో అశోక్‌ , డీఎస్‌ సీడీవో దయానంద రాణి, డీసీ ఎస్‌ఓ మోహన్‌ బాబు, డిటిడిఒ శంకర్‌ , డిపిఓ యాదయ్య, డివైసి ఈ ఇరిగేషన్‌ ప్రేమ్‌ చంద్‌ , డి ఎం సిఎస్‌ రాంపతి నాయక్‌, డిస్టిక్‌ ఎంప్లాయ్మెంట్‌ ఆఫీసర్‌ మాధవ రెడ్డి , బీఎండబ్ల్యూ ఒ జగదీశ్వర్‌ రెడ్డి మరియు పోషణ అభియాన్‌ సిబ్బంది పాల్గొన్నారు.