దేశ జీడీపీలో పౌల్ట్రీ రంగం వాటా ఒక శాతం

– తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత ఉంది :పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సులో సబ్యసాచీ ఘోష్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పౌల్ట్రీ రంగం దేశ జీడీపీలో పౌల్ట్రీ రంగం వాటా ఒక శాతంగా నమోదు అయిందని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచీ ఘోష్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఈ రంగంలో ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సును ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ఉత్సవమన్నారు. ఇది దేశ, విదేశీ ఉత్పత్తిదారులు పౌల్ట్రీ పరికర తయారీదారులను ఏకం చేస్తున్నదని తెలిపారు. 40 దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొ న్నారని చెప్పారు. పరిశ్రమలో ఉత్తమ పద్ధతులను అవలంబించడం, నూతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతలను స్వీకరించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఖర్చుల నిర్వహణను మెరుగుపరచు కోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సు ఈ పరిశ్రమలో, పరిశోధనలు, టెక్నాలజీ మార్గదర్శకాలను అందించే గొప్ప వేదికగా మారుతుందని అన్నారు.