– ఐదేండ్ల క్రితం నాటి స్థాయిలోనే ఉంది
– ప్రపంచ బ్యాంక్ తాజా అంచనా
గడచిన ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో పేదరికంలో ఎలాంటి మార్పు రాలేదు. 2019, 2020 సంవత్సరాలలో పేదరికం బాగా పెరిగినప్పటికీ 2021లో కొంత తగ్గింది. కానీ 2018లో ఏ స్థాయిలో ఉన్నదో గత సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉన్నదని ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక తెలిపింది. కోవిడ్ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలలో పేదరికం బాగా పెరిగింది. అయితే మన దేశంలో 2019 లోనే దాని పెరుగుదల ధోరణి కన్పించింది.
న్యూఢిల్లీ : ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం 2018లో 151.79 మిలియన్ల భారతీయులు పేదరికంతో అలమటించగా 2019లో ఆ సంఖ్య 176.09 మిలియన్లకు పెరిగింది. అంటే ఆ సంవత్సరంలో పేదల సంఖ్య సుమారు 24 మిలియన్లు పెరిగిందన్న మాట. 2018లో మన దేశంలో పేదరిక రేటు 11.09% ఉంటే 2021లో 11.9%గా నమోదైంది. అయితే ఈ రేటు 2020లో చాలా ఎక్కువగా అంటే 14.72%గా ఉంది.
ప్రపంచబ్యాంక్ లెక్కల ప్రకారం కొనుగోలు శక్తి ఆధారంగా తీవ్రమైన పేదరిక రేటు అంటే రోజుకు రూ.180. కేంద్ర ప్రభుత్వం వద్ద 2011-12 నుండి కుటుంబ వినియోగదారుల వ్యయ సర్వే (సీఈఎస్) సమాచారం అందుబాటులో లేదు. దీంతో మన దేశంలో పేదరికానికి సంబంధించిన అంచనాల కోసం ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ పైనే ప్రపంచబ్యాంక్ ఆధారపడింది. ఈ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైన సమాచారాన్ని తన అంచనాల కోసం ఉపయోగించుకుంది. 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబందించిన సీఈఎస్ల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. 2017-18లో ప్రభుత్వం ఇలాంటి సర్వేని జరిపినప్పటికీ వివరాలు బహిర్గతం చేయలేదు. అయితే బయటికి పొక్కిన సమాచారం ప్రకారం పేదరిక స్థాయి బాగా పెరిగింది. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 2018లో గరిష్ట స్థాయికి చేరింది. కోవిడ్కు ముందు 2018-19లో పేదరికం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని ఒకప్పటి ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎన్సీ సక్సేనా చెప్పారు. ప్రభుత్వం 2017-18లో నిర్వహించిన వినియోగ సర్వే ప్రకారమే పేదరికం పెరి గింది. 2005-15 మధ్యకాలంలో నిర్మాణాలలో పెట్టుబడులు బాగా పెరిగాయి. 2015 తర్వాత అవి తగ్గిపోయా యి. దీంతో నిర్మాణ రంగంలో ఉపాధి పొందిన వారు ఉద్యోగాలు కోల్పోయారు. వాస్తవ వేతనాలలో పెరుగుదల లేదని గణాంకా లు చెబుతున్నాయి. కార్మికుల సంఖ్య కూడా పెద్దగా పెరగలేదు. దీనివల్ల చాలా మందికి ఉద్యో గాలు లేకపోవడమో లేదా వారు ఉద్యోగాల కోసం వెదకడమో జరిగింది. మన దేశంలో 2019లో అత్యంత పేదలుగా ఉన్న వారి సంఖ్యకు సం బంధించి తాను వేసిన అంచనాలను ప్రపంచబ్యాంక్ సవరించింది. కడు పేదరి కాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్యను 136.81 మిలియన్లుగా చూపిన ప్రపంచ బ్యాంక్, ఆ తర్వాత దానిని సవరించి 176.09గా నమోదు చేసింది. కోవిడ్ కారణంగా 2020లో 56 మిలియన్ల భారతీయు లు అత్యంత పేదరికంలో మగ్గిపోయారు.