క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లో క్లూస్ టీమ్ ప్రాముఖ్యతను చూపించేలా తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో,హీరోయిన్లుగా నటించారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా, సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ కథ పుట్టడానికి మూలం క్లూస్ టీమ్ హెడ్ వెంకన్న ఇంటర్వ్యూని చూశాను. మామూలుగా ఓ క్రైమ్ జరిగినప్పుడు క్లూస్ టీమ్ చేసే పనే అధికంగా ఉంటుంది. వారు సేకరించేవే కోర్టులో సాక్ష్యాలుగా నిలబడతాయి. క్రైమ్ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీమ్ పరిష్కరిస్తుం టుంది. అయితే క్లూస్ టీమ్ గురించి ఇంత వరకు ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ల గురించి చెప్పాలని ఈ కథ రాసుకున్నాను. మర్డర్, రాబరీ సీన్లతో సినిమాను అల్లుకున్నాను. చాలా వరకు రియలిస్టిక్గా ఉంటుంది. యదార్థ సంఘటనలకు కూడా కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి తీశాను. కార్తీక్ రాజు ఆల్రెడీ మూవీస్ చేశారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా పని చేశారు. ఈ మూవీకి వారి అనుభవం బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా సెకండ్ హాఫ్లో ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ను ఎవ్వరూ ఊహించరు. ఆ సీన్లకు ప్రేక్షుడికి ఫుల్ హై వస్తుంది. శ్రీచరణ్ పాకాల ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నారు. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చారు. పోలీస్ సైరన్ నుంచి కూడా ఓ మ్యూజిక్ క్రియేట్ చేశారు. ఆర్ఆర్తో పాటు మాకు మంచి మాస్, రొమాంటిక్, ఫోక్ సాంగ్స్ కూడా ఇచ్చారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఎంతో గ్రిప్పింగ్గా సినిమా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ను ఇష్టపడే ప్రేక్షకులే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది’ అని తెలిపారు.
క్లూస్ టీమ్లో హీరో పని చేస్తుంటాడు. హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్. కథలో భాగంగానే రెండు పాత్రలుంటాయే తప్ప కావాలని హీరో, హీరోయిన్ ట్రాక్ పెట్టలేదు. నిర్మాతలు ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు హీరో, హీరోయిన్ల గురించి, టీమ్ గురించి చెప్పలేదు. వారికి ఈ కథ బాగా నచ్చడంతో ఎంతైనా పెట్టేందుకు ముందుకు వచ్చారు. సినిమా బాగా రావాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.