అర్హుల ఎంపీకే లక్ష్యంగా.. ఇంటింటా సర్వేకు సిద్ధం

– ముమ్మరంగా దరఖాస్తుల కంప్యూటీకరణ

నవతెలంగాణ-  మల్హర్ రావు
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తియి కంప్యూటికరణ కొనసాగుతోంది. ఈనెల 16వరకు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.నిర్జిత సమయానికి పూర్తి చేస్తే తరువాత అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలు కానుంది. మండల వ్యాప్తంగా 9,192 దరఖాస్తులు వచ్చాయి.ఎక్కువ భూ సమస్యలు,రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలను అంధించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.కాగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తీయింది. తరువాత డేటా ఎంట్రీ ప్రక్రియ ఈ నెల 7 నుంచి 16 వరకు కొనసాగుతోంది. మండలంలో ప్రయివేటు, ప్రభుత్వ ఆపరేటర్లు 27 మంది పని చేస్తున్నారు. ఇప్పటి వరకు 57 శాతం డేటా ఎంట్రీ పూర్తి అయినట్లుగా మండల ఎంపిడిఓ నరసింహమూర్తి పేర్కొన్నారు.