– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోడీ 73వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఆదివారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలను బీజేపీ నిర్వహిస్తోంది. ”ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన దూరదృష్టి, బలమైన నాయకత్వంతో ప్రతి రంగంలో దేశ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు అమిత్ షా ,రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
పొగతో మోడీ చిత్రం..
దీపక్ బిస్వాల్ అనే కళాకారుడు దీపం నుంచి వచ్చే పొగతో మోడీ చిత్రాన్ని రూపొందించాడు. దీనిలో ప్రధాని చిత్రం వెనుక కోణ్కార్ చక్రాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు.
చేతివృత్తుల వారికోసం 13 వేలకోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకం
విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తుల వారి కోసం రూ.13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలో 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ని ప్రారంభించారు. ”ద్వారకాలో యశోభూమి సమావేశ మందిరాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఈ మందిర ఫేజ్-2 ని ఆదివారం ప్రారంభించారు.