ఎఫ్‌ఎల్‌ఒ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రియా గజ్డర్‌

ఎఫ్‌ఎల్‌ఒ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రియా గజ్డర్‌హైదరాబాద్‌ : ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఒ) నూతన ఛైర్‌పర్సన్‌గా ప్రియా గజ్డర్‌, వైఎఫ్‌ఎల్‌ఒ చైర్‌పర్సన్‌గా రిది జైన్‌ నియమితులయారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఎఫ్‌ఎల్‌ఒ వార్షిక సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఎల్‌ఒ చీఫ్‌గా ఉన్న రితు షా పదవీ కాలం 2023-24తో ముగిసింది. కొత్త కమిటీ 2024-25 వరకు కొనసాగనుంది. రిది జైన్‌ 19వ వైఎఫ్‌ఒగా బాధ్యతలను స్వీకరించారు.