వర్షపునీరు నిల్వ ఉండకుండా ఆరోగ్యాలను కాపాడుకోవాలి

– మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్
నవతెలంగాణ – జమ్మికుంట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డులలో మంగళవారం డ్రై డే తో పాటు నీటి ట్యాంకుల శుభ్రం కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్  అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.  వార్డులలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  వార్డులలో దోమలు ప్రభలకుండా నీరు నిల్వ ఉన్న చోట నీరును పారబోసి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాపిస్తాయని, వార్డులలో ఒక్క చోట నీరు నిల్వ ఉన్న వార్డు మొత్తం సమస్య ఏర్పడుతుందని,  వర్షాకాలం లో వాడే ప్రతి నీటిని మూతలతో మూసివేయాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రభలకుండా జాగ్రత్త పడాలని అన్నారు. వార్డులలో ఉన్న నీరు సరఫరా చేసే ట్యాంక్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి , మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్,  సీనియర్ అసిస్టెంట్ భాస్కర్,  సానిటరీ ఇన్ స్పెక్టర్ సదానందం,  మెప్మా ఆర్పీలు,  ఏఎన్ఎంలు,  ఆశ వర్వర్లు,  అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.