శాంతి భద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్
సురక్ష దినోత్సవంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
షీ టీమ్స్తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్దిఉత్సవాలు సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కక్షలు కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో శాంతి కపోతాలు ఎగురు తున్నాయి అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను తూచ తప్పకుండా పోలీస్శాఖా అమలు పరుస్తున్నందునే తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగ లేదన్నారు. ఫ్రాక్షన్ విలేజీల్లోనూ ప్రశాంతత ఫరీడవిల్లుతున్నది అంటే ప్రజా క్షేమం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ మాత్రమేనన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో శాంతి బద్రతలను పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అని అది ఇప్పుడు దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా కట్టడిలో ఉన్నందునే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి 50 వేల పరిశ్రమలు నెలకొల్పారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను పోలీస్ శాఖా అమలు పరుస్తునందునే తెలంగాణా పోలీస్ అద్భుత విజయాలు నమోదు చేసుకుందన్నారు.
ఒకప్పుడు పల్లెల్లో అసాంఘిక శక్తుల కార్యాకలాపాల వల్ల పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు మరియు పల్లెల్లో రోడ్లు కమ్యూనికేషన్ ప లేక ఏదైన నేరం జరితే పోలీసులు ఆలస్యంగా వచ్చేవారు. నేడు ప్రభుత్వం ఏర్పరిచిన డయల్ 100 బ్లూ కోర్టు ద్వారా సత్వరమే ప స్పందించి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో గ్రామాల్లో సమాచార వ్యవస్థ లేకుండేది తెలంగాణ రాకముందు 2014 సంవత్సరాని కంటే ముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల నేడు సత్వర స్నేహపూర్తి వాతావరణంలో సమస్యలు పరిష్కారము అవుతున్నాయి.
బందోబస్తు డ్యూటీలో ఉండే మహిళా సిబ్బంది అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని మోబైల్స్ టైలెట్స్ అందుబాటులోకి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి, నకరేకల్, నాగార్జునసాగర్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, రవీందర్ కుమార్ నాయక్, నల్లబోతు భాస్కరరావు, గాదరి కిషోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ కే.అపూర్వరావు, అడిషనల్ ఎస్పీ ప్రసాదరావు, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ పెద్దలు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా సురక్షా దినోత్సవ ర్యాలీ
ఎస్పీ సారథ్యంలో ర్యాలీతో సంబురాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్షా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కే.అపూర్వరావు అధ్వర్యంలో సురక్ష దివస్ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పోలీస్ వాహన ర్యాలీని జడ్పీ చైర్మెన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ టీి.వినరు కృష్ణారెడ్డితో కలిసి ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమై వివేకానంద విగ్రహం మీదుగా క్లాక్ టవర్ సెంటర్ వరకు క్రమశిక్షణతో చేరుకుంది. పోలీసుల ద్విచక్ర వాహానాలతో పాటు పెట్రో కార్సో పోలీసు శాఖ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పోలీస్ కళాజాత ఆధ్వర్యంలో షీటీమ్, పోలీసుల పనితీరుపై పాటల రూపంలో వినిపించారు. బాంబులు కాల్చుతూ, ర్యాలీ పొడవునా పూల వర్షం కురిపించారు. ర్యాలీలో దాదాపు 1000 మంది సిబ్బంది, అధికారులు పాల్గొని క్రమశిక్షణతో నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్శాఖలో చేపట్టిన సంస్కరణలు మార్పులు గమనించాలన్నారు. మనందరికీ స్వేచ్ఛనిచ్చింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాతనేనని , 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో తెలంగాణ అడిగిడుతున్న శుభ సందర్భంగా అన్ని శాఖలు సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ ఈ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ రాగానే మొట్టమొదటిగా పోలీస్శాఖపై ప్రత్యేక దృష్టి సారించి బలోపేతం చేసి శాంతి భద్రతలను అదుపు చేశారని, పోలీస్ శాఖ సేవలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరానికి కృషి చేస్తున్నారన్నారు. పోలీసు సంక్షేమానికి ఏ అవసరమైన అయినా ఉపయోగించుకోవడానికి నా సొంత నిధుల నుండి రూ.50 లక్షల నిధులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గంజాయిని అరికట్టడంలో మన జిల్లా పోలీసులు ప్రత్యేక కృషి చేశారని, జిల్లా పోలీసులు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నందున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక శాంతిభద్రతలను ప్రాముఖ్యతనిచ్చినందునే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు మొదలగునవి రాష్ట్రానికి రావడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ఉత్సవాలలో భాగంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయిస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లాకు 40 పెట్రోలింగ్ వాహనాలు, 100కు పైగా పెట్రోలింగ్ బైకులు, కంప్యూటర్లు, ట్యాబ్లు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కేటాయించడం వల్లనే డయల్ 100 కాల్ రాగానే ఏడు నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ సమస్యను పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని తెలిపారు. ఏ మారుమూల గ్రామంలోని ప్రజలకైన పోలీసు సేవలందిస్తున్నామని, తెలంగాణ స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ద్వారా 775 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉంటే అన్నింటినీ కమండ్ కంట్రోల్ పరిధిలోనే పనిచేస్తున్నాయన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో బాంబ్ స్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్,క్లూస్ టీమ్, షి టీమ్, డయల్ 100 ల పని తీరుపైన అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి, ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రినిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, అడిషనల్ ఎస్పీ కేఆర్కే.ప్రసాదరావు,12 వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ, డిఎస్పీ లు నరసింహ రెడ్డి, వెంకటగిరి, నాగేశ్వర రావు, రమేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు, సిబ్బంది, పట్టణ కౌనిలర్స్, యువకులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
12వ బెటాలియన్లో…
పట్టణ పరిధిలోని అన్నెపర్తిలో ఉన్న 12వ బెటాలియన్లో సురక్ష దివస్ సందర్భంగా కమాండెంట్ ఎన్. వి. సాంబయ్య ఆధ్వర్యంలో స్కూల్ చిల్డ్రన్స్ కి ఓపెన్ హౌస్ నిర్వహించి బెటాలియన్ లో ఉన్న అధునాతన ఆయుధాల గురించి అవగాహాన కల్పించారు. ప్రొజెక్టర్ స్క్రీన్ పై బెటాలియన్ సిబ్బంది గత పది సవత్సరాలుగా సొసైటీ కి చేసిన సేవను విడియో రూపం లో చూపించచారు. అదనపు కమాండెంట్ బి.రామకృష్ణ మాట్లాడుతూ పోలీసులు సమాజంలో ప్రజలతో కలిసి మెలిసి ఉండే తీరు, వెపన్స్ పని తీరు గురించి పిల్లలకు వివరించారు. కార్యక్రమంలో సహాయక కమాండెంట్ ఏ. తిరుపతి, టి. వెంకన్న, ఎమ్.రాజు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.