అధికారుల పనితీరు పై ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులు

– కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సమావేశం..
– కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తీర్మాణం..
– ప్రజాప్రతినిధుల్లో కనిపించని ఉత్సహం..
నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో అధికారుల పార్టీలపై ప్రజా ప్రతినిధులు అగ్ర వ్యక్తం చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించగా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు సూచించే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని అదికారులకు సూచించారు. ప్రతినిధులు అడిగే సమస్యలను అధికారులు నోట్ చేసుకోవాలని సూచించారు. కాగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీ లలో గత సభ్య సమావేశాల్లో కనిపించిన ఉత్సహం నేటి సమావేశంలో కనిపించక పోవడం విశేషం. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనoగా అధికారం చేపట్టాక ఈ తొలి సర్వసభ్య సమావేశం కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.నాగార్జున సాగర్ లో నీటి లభ్యత లేకపోవడం వలన వచ్చే వేసవి కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందన్నారు.అందుకు సాగర్ ఎడమ కాలువ నుండి నీటిని వదిలి చెరువులను నింపాలని ఆయన కోరారు.పాలేరుకు వెళుతున్న నీటిని సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల్లోని ఆయా గ్రామాలలో చెరువులు నింపాలని ఎంపి సూచించారు.మిషన్ భగీరథ పథకంలో పనుల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి  రూ.10 కోట్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై తీర్మాణం: కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టులు వెళ్లడం వలన తెలంగాణ రాష్ట్రం తన హక్కులను కోల్పోతుందని,కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను కెఆర్ ఎంబి పరిధిలోకి తీసుకుని వెళ్లవద్దని ఈ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు సభ్యుల పక్షాన ఆమోదింప జేసీనట్లు ఆమె వెల్లడించారు.ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై పలువురు జడ్పీటీసీలు,ఎంపిపిలు అసహనం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇప్పటికైనా కొంతమంది అధికారులు తమ పనితీరును మార్చుకోకుంటే రానున్న వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తమ శాఖ ఉద్యోగులు జరుగుతున్న పనితీరుపై ప్రజా ప్రతినిధులకు వివరిoచారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జడ్పీ సీఈవో సురేష్, అధికారులు జెడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: కృష్ణా జలాల విషయంలో కేంద్ర జలశక్తి సంఘం నూతన నిబంధనలు తగదు.తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఎంపీల పోరాటం కృష్ణ రివర్ మానిటరింగ్ బోర్డు (కే ఆర్ ఎం బి) కి శ్రీశైలం, నాగార్జునసాగర్ నదీ జలాల నిర్వహణ బాధ్యతలను కేంద్ర జలశక్తి సంఘానికి అప్పగిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా తో పాటు తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగ యాదవ్  ఆరోపించారు.శనివారం సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడం సిగ్గుచేటు అని అన్నారు.ఇన్నాళ్ళుగా బీ ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఈ విషయాన్ని తమ ప్రభుత్వం  వ్యతిరేకించిందని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం తెలంగాణ జలాల వాటా విషయంలో రాజీ పడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణ హక్కులు కోల్పోకుండా కృష్ణా నది జలాలను దక్కించుకోవడానికి పోరాటం చేయాలని సూచించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపి కేంద్ర జనరల్ వనరుల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం  ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వేసిన పొలాలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని  వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణా జలాల విషయంలో ఉన్న  నిబంధనలను యధాతధంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది బిక్షం తదితరులు పాల్గొన్నారు.