పనులు ప్రారంబిస్తున్న ప్రజా ప్రతినిధులు

– చివరి రోజు..శిల పలకాల మోజు.!
– నూతన భవనాలు ప్రారంభం
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల హడావుడి లో సర్పంచ్ లు
నవతెలంగాణ – చందుర్తి
మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ లు హడావుడిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.కొత్త పనులకు శంకుస్థాపన లు చేశారు.దీంతో ఫిబ్రవరి ఫస్ట్ తో సర్పంచ్ ల పదవి కాలం ముగుస్తున్న నేపద్యం లో కుంటు బడిన అభివృద్ధి పనుల ను ప్రారంభించారు.
సంవత్సర కిందట పూర్తైన   భవనాలు ప్రారంభం:గత సంవత్సర కిందట మర్రిగడ్డ హెల్త్ సెంటర్,మూడపల్లి హెల్త్ సెంటర్,సనుగుల లో    భవనాల పనుకు పూర్తైనాయి దీంతో అసౌకర్యంగా కొన్ని పనుకు పెండింగ్ ఉండగా అట్టి నూతన భవనాలను ప్రారభించ లేదు.దీంతో పదవి చివరి రోజైన ఆ భవనాలు ప్రారంభించాలని ఆయా సర్పంచ్ లు కంకణం కట్టుకున్నారు..
శిలా పలకాలపై పేరు ఉండాలి ? ఐదు సంవత్సరాలు గ్రామంలో వివిద అభివృద్ధి పనులు అప్పులుచేసి నిర్మించిన   బిల్లు లు రాక పోయిన  ఆయా నూతన భవనాలపై తమ పేరు లేకపోతే ఎలా అని సర్పంచ్ లు  హడావుడిగా అప్పటికప్పుడు  శిలా పలకల ను ముద్రించి తాము చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో  ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా చివరి రోజున అభివృద్ధి పనుల కు అన్ని గ్రామాల్లో సర్పంచ్ లు ప్రారంభ మోజులో  ఉండిపోయారు.