నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల లోని ఓసిపి బ్లాక్-1 లో గురువారం కురిసిన బారి వర్షానికి కోల్ మైనింగ్ లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం, మట్టి తవ్వకాలకు ఆటంకం ఏర్పడిందని ఏఎమ్మార్ పిఆర్ఓ మల్లేష్ తెలిపారు. ఒకరోజు ఓసిపి పనులకు ఆటంకం కలగడంతో 4000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడినట్లుగా, 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాల వెలికితీతకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఓసిపిలో రోడ్లు బురదమయం కావడంతో బొగ్గు, మట్టి వెలికి తీసే, యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.