
– కాటారంలో ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ
– ఏఈడబ్ల్యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా.బాబా సాహెబ్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 (ఏఈడబ్ల్యుఎస్) జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ఆదివారం మండలంలోని కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో కాళేశ్వరం జోనల్ (ఏవైయు) అల్ యూత్ యూనిట్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అధ్యక్షతన, ఎల్ ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షుడు గంట రాజబాబు, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ కోఆర్డినేషన్ లో మాత రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అల్ ఎంప్లాయిస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్ తెలిపారు.ఆదివారం కాటారంలో జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు అల్ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.మెరుగైన సమాజ నిర్మాణం కృషి చేయాలనుకునేవారు,మహనీయుల అభిమానులు మంథని,కాటారం డివిజన్ల నుంచి ఉద్యోగులు,కార్మికులు,కర్షకులు,అంబేద్కర్ వాదులు,విద్యార్థులు, మేధావులు,కులమత,లింగ విబేధాలు లేకుండా సబండా వర్గాల ప్రజలు వందలాదిగా స్వచ్ఛందగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికి సొసైటీలో ఉన్న వనరుల మేరకు మాత రమాబాయి జీవిత చరిత్ర గ్రంధాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.ఆహ్వాన పత్రాలు ఇంటింటా అందజేయునట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పటి ప్రవీణ్, బొడ్డు రాజబాబు,కందుగుల రాజన్న, రాజయ్య, మౌలాన ఖాన్, మండల అధ్యక్షుడు రాగం కుమార్ పాల్గొన్నారు.