
భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద గాలివానకు ఐమాక్స్ లైట్లు ధ్వంసం కాగా, వాటి స్థానంలో నూతన ఐమాక్స్ లైట్లను బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో రాత్రి సమయాలలో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.