ఆర్టిఐ రక్షణ వేదిక, నూతన క్యాలెండ ఆవిష్కరించిన , ఆర్ డి వో రమాదేవి

నవతెలంగాణ-మల్హర్ రావు : అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని, జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఆర్డీవో రమాదేవి,జిల్లా కార్యాలయంలో  బుధవారం రోజున,  సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2024క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రమాదేవి మాట్లాడుతూ మాట్లాడుతూ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలని, పిలుపునిచ్చారు.అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని,ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. స, హ చట్టం,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలని ఆయన అన్నారు, ఆర్.టి.ఐ జిల్లా ఉపాధ్యక్షులు మండల యుగంధర్ గౌడ్ పోశయ్య ఆర్టిఐ, మలహర్ (తాడిచర్ల) మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, లక్ష్మణ్ చొప్పరి రాజయ్య తదితరులు రాజు రమేష్ రాజేష్ పాల్గొన్నారు.