నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ ఒకటవ మరియు బి.పి.ఎడ్. ఒకటవ మరియు మూడవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుషన్/ రీకౌంటింగ్ కొరకు షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ రెగ్యులర్ ఒకటవ సెమిస్టర్ ఏప్రిల్ లో పరీక్షకు హాజరైన విద్యార్థులు రీవాల్యుయేషన్/ రీకౌంటింగ్ కోరుకున్నట్లయితే ఈనెల 11 లోపు ప్రతి పేపర్ కు రివాల్యుయేషన్ ఫీజు రూపాయలు.500/రీకౌంటింగ్ కొరకు రూపాయలు. 300/ చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ పేర్కొన్నారు. రెగ్యులర్ బి.పి.ఎడ్ ఒకటవ,మూడవ సెమిస్టర్ మార్చి లో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థులు రీవాల్యుయేషన్/ రీకౌంటింగ్ కోరుకున్నట్లయితే ఈనెల 28 లోపు ప్రతి పేపర్ కు రివాల్యుయేషన్ ఫీజు రూపాయలు.500/ రీ కౌంటింగ్ కు రూపాయలు. 300/ చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.