బిఎస్కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ వేడుకలో టీజర్ని కూడా విడుదల చేశారు. బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘మా సినిమాను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేస్తున్నాం. ఇదొక సంఘర్షణతో కూడుకున్న కథ. నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలతో లోవరాజు క్యారెక్టర్ రాసుకున్నా. నేను గతంలో ‘నిర్భందం, నిర్భందం2, మాంగళ్యం’ సినిమాలను రూపొందించాను. అవి డిజిటల్గానే మీ ముందుకు వచ్చాయి. ఒక మంచి ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నా స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యా. అలా మార్చి చేసిన సినిమానే ఇది. నా గత సినిమాలను కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రమే చూశారు. కానీ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వేడుకలో రిలీజ్ చేసిన పరాక్రమం డేట్ అనౌన్స్మెంట్ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది. సినిమాను థియేటర్లోనే చూడాలనే క్యూరియాసిటీ ఈ టీజర్ క్రియేట్ చేసింది’ అని తెలిపారు.