మండలంలోని శివాయ పల్లి మండల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేలకు నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు నాయకుల వేషధారణలో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వామి, గ్రామ సర్పంచ్ విట్టల్ రెడ్డి ఉప సర్పంచ్ సంధ్య, ఎస్ఎంసి చైర్మన్ బాలరాజ్, వార్డ్ మెంబర్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.