
బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంకు రాజీనామా చేసినట్లు కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి బుచ్చి రెడ్డి, సాకి బాల లక్ష్మి ఆనంద్, రియాజుద్దీన్ లు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలనుండి మా పట్ల కొందరు రెండవ స్థాయి లీడర్లు, ముఖ్యంగా మున్సిపల్ మాజీ చైర్మన్ చూపిన వివక్ష కారణంగా, పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి వైఖరి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనేక విషయాల్లో మా ఆత్మగౌరవo దెబ్బ తినేలా ప్రవర్తన ఉండడంతో, ఎన్నో అవమానాలు ప్రజల కొరకు ఓర్చుకున్నట్లు తెలిపారు. గత 8 సంవత్సరాలనుండి 37వ వార్డ్ లో నిరుపేద దళిత కుటుంబాలకు దళిత బంధు విషయం లో, డబల్ బెడరూమ్ విషయం లో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజానర్సు చాలా వివక్ష చూపడం జరిగిందన్నారు. గత 3 సంవత్సరాల నుండి 7వ వార్డులో డబల్ బెడ్ రూమ్, దళిత బంధు, రేషన్ షాప్ అడిగిన ఇవ్వకపోవడం, అంగన్వాడీ ఇవ్వకపోవడం, ఇంకా 1.5 మీటర్స్ రోడ్డు వేయకపోవడం, అనింటికంటే ఎక్కువ గా కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మా ఆత్మ గౌరవం దెబ్బ తినేలా అనేక సందర్బంలో అవమానించడo జరిగిందని తెలిపారు. 20వ వార్డులో మైనారిటీ బంధు ఇవ్వకపోవడం, రోడ్లు వేయడం లో వివక్ష చూపడం, మైనారిటీ మహిళ లకు కుట్టు మెషిన్ ల విషయం లో, ఇలా ప్రతి విషయం లో వివక్ష చూపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం 6 గ్యారంటీలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితు లై, ప్రజా సంక్షేమ పధకాలు మా వార్డ్ ప్రజలకు అందించడానికి, వార్డ్ లో మిగిలిన అభివృద్ధి పనులు జరిపించడానికి, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు తెలిపారు.