– కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటూ, అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సమాచార హక్కు చట్టం చట్టాన్ని ఆయుధంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు నడుం బిగించాలన్నారు. అవినీతి అక్రమాలను ఎదుర్కొనేందుకు యువత, రైతులు, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు నడవాలని, ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాలనలో పారదర్శకత అధికారులు జవాబుదారితనం ఉండాలని సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక మల్హర్ మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మండల ఉపాధ్యక్షుడు చొప్పరి రాజయ్య, ప్రధాన కార్యదర్శి శేనిగల లక్ష్మన్, కార్యదర్శి బండి సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.