– మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ, ఈబీసీ, కళ్యాణ లక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. కళ్యాణలక్ష్మి కోసం మొత్తం 65,026 మంది దరఖాస్తులు చేసుకోగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 33,558 అర్జీలు వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చ్ 2024 వరకు 31,468 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎమ్మార్వోల వద్ద 28,225, ఆర్డీవోల వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 208 అర్జీలు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయన్నారు. పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. మొదటి దశలో విడుదలయిన రూ.1225.43 కోట్లలో మొత్తం దరఖాస్తులు కోసం రూ .649 .86 కోట్లు డిమాండ్ ఉండగా మంజూరైన దరఖా స్తుల కోసం రూ 240. 73 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు వారి ఆడ బిడ్డల పెళ్లిళ్ల సహాయం కోసం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 సహాయం చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రభుత్వం రూ.1225.43 కోట్లు మంజూరు చేయడం పట్ల పొన్నం హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.