నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పురుషుల పోదుపు సంఘం సభ్యుడు ఐలేని మహేందర్ రెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం పోదుపు సంఘం అధ్వర్యంలో రూ.2 వేలు నగదును మృతుని కుటుంబ సభ్యులకు మరణ సహయంగా అందజేశారు. సంఘం పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.