ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌లు షురూ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లో దూర ప్రాంత ప్రయాణీకుల కోసం ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. తొలి విడతలో శుక్రవారం నుంచి ఈసీఐఎల్‌-ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కాప్రా మున్సిపల్‌ కాంప్లెక్‌, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్‌, హెచ్‌ఎమ్‌టీ నగర్‌, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌, నాగోల్‌, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ నుంచి పికప్‌ వ్యాన్‌లు అందు బాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్టీసీ ప్రజాసంబంధాల అధికారి తెలిపారు.