న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ సామ్సంగ్ తదుపరి ఏఐ ఆవిష్కరణలతో కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. జనవరి 22న సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ శాన్ జోస్లో గెలాక్సీ ఏఐ తదుపరి స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణ ఉంటుందని పేర్కొంది. ఇవి ప్రతిరోజూ ప్రపంచంతో సంభాషించే విధానాన్ని మార్చనున్నాయని పేర్కొంది.