ఇసుక రవాణాను యధావిధిగా కొనసాగించాలి

– పెద్ద వాగు పరి రక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-చేర్యాల
మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆకునూరు పెద్ద వాగు పరి రక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సమీర్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామ ఎంపీటీసీ సుంకరి శ్రీధర్‌ గౌడ్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్‌ మాట్లాడుతూ పెద్ద వాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వ కాలం నుండి ఇంటి నిర్మాణం, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం ఎప్పటి నుంచో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటున్నామన్నారు. ఇటీవల అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న కారణంగా ఓ ట్రాక్టర్‌ను టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు పట్టుకొని కేసులు పెట్టి ఇసుక రవాణాను నిలిపి వేయడంతో గ్రామంలో చేపడుతున్న ఇళ్లు, దేవాలయాల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయి ఇబ్బం దులు ఎదురవుతున్నాయన్నారు. తమ గ్రామ వాగు ఇసుక తమకు చెందకుండా అధికా రులు షరతులు విధించి ఇబ్బందు లకు గురి చేయడం సరి కాదన్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి ఇసుక రవాణా యధావిధిగా కొనసాగించే విధంగా అధికారులు అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్‌ ముట్టడి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ నాయకులు బోయిని బాలయ్య, పుల్లని వేణు, అందె నాని, బాబు, కడారి నరేష్‌, కన్నబోయిన శ్రీనివాస్‌, కోయినేని నర్సయ్య, ఎర్ర అశోక్‌, కడారి పరశురాములు పాల్గొన్నారు.