నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఈనెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతిఓజా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ జూని యర్ కాలేజీల యాజమాన్యాలు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని డీఐఈవోలను ఆదేశించారు. ఈ నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ఈనెల 17న జూనియర్ కాలేజీల్లో తరగతులు పున:ప్రారంభమవుతాయని వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 12 నుంచి 17 వరకు ఆరురోజులపాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులను ఇచ్చింది. దీంతో ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు మిషనరీ స్కూళ్లకు వర్తించబోవు. ఈనెల 18 నుంచి మిగతా పాఠశాలల్లో తరగతులు పున: ప్రారంభమవుతాయి.