నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతి జరుపుకునే తీరును ముగ్గులతో వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంగరవేణి రవి , డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వినిష్ కుమార్ పాల్గోన్నారు.