‘పలాస 1978’లో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. కోమలి కథానాయికగా నటిస్తోంది. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ హదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలు, టీజర్కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు. హీరోయిన్పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనంటున్నారు దర్శక, నిర్మాతలు. పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పటివరకు వచ్చిన మూవీ కంటెంట్తో.. ఈ ప్రేమకథా చిత్రంలో గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. భిన్న కథలను ముఖ్యంగా ప్రేమకథలను మన తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్విఎస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. రైటర్, డైరెక్టర్ సాయి మోహన్ ఉబ్బన సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి మరియు దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమర్పణ : గౌరీ నాయుడు, రచన,దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన, నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొల్లేటి, సంగీతం: శరవణ వాసుదేవన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనుదీప్ దేవ్, సినిమాటోగ్రఫీ: శ్రీ సాయికుమార్ దారా, ఎడిటర్: గ్యారీ బీహెచ్.