– మంద కృష్ణమాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుననుసరించి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసన సభ్యులు, సామాజిక వేత్తలు మంత్రులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులను కలిసిన వారిలో శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల శామ్యూల్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజరు కుమార్ ముంజగళ్ళ, బాపిరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేష్లు ఉన్నారు.