నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్కు సంబంధించి ప్యాకేజింగ్ టెక్నాలజీ పోస్టుకు తాత్కాలింగా ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన శనివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల ఒకటిన కూడా ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని తెలిపారు. శనివారం వెబ్ఆప్షన్ల నమోదు లింక్ను ఇస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ ఏడో తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే.