
– లక్ష లోపు 7366,1 లక్ష 50 వేలు లోపు 4242 లబ్ధిదారులు….
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ఆద్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట ఋణ మాఫీ పధకంలో మంగళవారం రూ. 1 లక్షా 50 వేలు లోపు ఉన్న పంట ఋణం ఉన్న రైతులకు ఋణ విముక్తి కలిగించింది.తొలి మలి విడతలు తో మొత్తం నియోజక వర్గంలో 11608 మందికి పంట ఋణం మాఫీ లబ్ధిదారులు గా ప్రకటించింది. మొదటి విడతగా రూ.1 లక్ష లోపు 7366 మందిని,రెండో విడతగా రూ.1 లక్ష నుండి 1 లక్షా 50 వేలు పంట ఋణం ఉన్నవారికి మాఫీ చేసింది.
మండలం తొలి మలి మొత్తం
అశ్వారావుపేట 1781 1082 2863
దమ్మపేట 2055 954 3009
ములకలపల్లి 1642 1052 2694
అన్నపు రెడ్డి పల్లి 764 458 1222
చండ్రుగొండ 1124 696 1820
మొత్తం 7366 4242 11608