లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి

నవతెలంగాణ – పెద్దవూర
లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని చలకుర్తి వ్యవసాయ విస్తరణ అధికారీ సీతార అన్నారు. గురువారం మండలం లోని తుంగతుర్తి గ్రామం లో విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై  అవగాహన కల్పించి మాట్లాడారు.ఖరీఫ్ లో వరి,పత్తి, కందులు ఇతర పంటలు సాగు చేయుటకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నాని రైతులు  విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన సంచి మీద కంపెనీ పేరు,విత్తనరకం, బ్యాచ్ నెంబర్,లాట్ నెంబర్,రేటు ఉన్నదో పరిశీలించాలన్నారు.విత్తనం కొనుగోలు చేశాక రైతు తప్పకుండా బిల్ రశీదు తీసుకొని,అది పంట కాలం అయిపోయే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.గ్రామంలో లూజు విత్తనాలు,తక్కువ, ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మే వారెవరైనా వస్తే రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వరిలో వెలుజలే పద్ధతి వలన కూలీల కొరతను అధిగమించి పెట్టుబడి తగ్గించవచ్చునని ఎకరానికి 4.5 వేల రూపాయలను ఆదా చేయవచ్చని అన్నారు .విత్తనాలు ఎకరానికి 10 నుండి 15 కిలోలలు తగ్గించచ్చని తెలిపారు. డ్రం సీడర్ పద్ధతిలో వరి నాట్లు వేయాలని సూచించారు. వరి కంపోస్ట్ లాంటి సేంద్రియ పద్ధతులు ఉపయోగించి ఎరువులు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెండే విష్ణుప్రియ సైదులు,రైతులు పాల్గొన్నారు.