
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సి ఈ ఐ ఆర్ టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకున్న హుస్నాబాద్ పోలీసులు ఆదివారం తిరిగి బాధితుడికి అప్పగించారు. హుస్నాబాద్ మండలంలోని కుచనపల్లి గ్రామానికి చెందిన నిమ్మకంటి దీపక్ గత కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ను పోగొట్టుకున్నాడు. తన ఫోను పోయిందని హుస్నాబాద్ పోలీస్ పోలీస్ స్టేషన్ కు రాగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేశారు. వెంటనే ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తికి సెల్ ఫోన్ అందించారు..ఈ సందర్భంగా హుస్నాబాద్ పోలీసులు మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటే లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన వెంటనే సి ఈ ఐ ఆర్ లో పూర్తి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.