నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపర్చామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్ ఏడో తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే.