గోపీచంద్ హీరోగా, శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. భారీ బడ్జెట్తో లావిష్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఇటలీ, మిలాన్లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్లో హీరో గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ నేతత్వంలో ఓ సాంగ్ని గ్రాండ్గా ఈ షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. గోపీచంద్ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో దర్శకుడు శ్రీనువైట్ల ప్రజెంట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని అత్యుత్తమ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.