రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం..

నవతెలంగాణ- తాడ్వాయి 
తాడ్వాయి మండల కేంద్రంలోని రవీంద్ర భారతి ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నారులంతా శ్రీ కృష్ణుని వేషధారణలో, అందమైన గోపికమ్మల వేషధారణలో అలరించారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్నారులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమం గురించి   పాఠశాల ప్రిన్సిపాల్ ఆది స్వామి  మాట్లాడుతూ ద్వాపర యుగంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడని, దేవకీ వసుదేవులకు అష్టమ సంతానం అని, శ్రీ కృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారమని తెలిపారు.కరెస్పాండెంట్ భాస్కర్ గౌడ్ శ్రీ కృష్ణాష్టమి రోజు పిల్లలందరూ మరింత ఉత్సాహంతో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాద్యాయులు,తల్లి దండ్రులు కారణం అయ్యారని అన్నారు. ఈ ఉత్సవంలో పాఠశాల ఉపాద్యాయులు, తల్లి దండ్రులు, తదితరులు పాల్గొన్నారు..