
నిజామాబాదు జిల్లా కేంద్రం ఉన్న, తెలంగాణ,బీడీ యాజమాన్యం సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ, దర్మెంద్రగాందీ కి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ రాష్ట్ర కమీటీ ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం,రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు,విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీడీ కార్మికులందరికీ పెరిగిన కరువు భత్యం (వీడీఏ),తేదీ-1-4-2024,నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం (వీడీఏ) పెరిగిందన్నారు. 2023,జనవరి నుండి 2023,డిసెంబర్ వరకు, ప్రభుత్వం పెంచే నిత్యవసర ధరలకు అనుకులంగా,వినిమయ ధరల సూచి 1696 నుండి1809 పాయింట్లకి పెరిగిందని తెలిపారు. అంటే 113 పాయింట్లు పెరిగాయని,1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింటుకు రూ. 10 పైసల చొప్పున, రూ.11 రూపాయల రూ.30 పైసలు ,వెయ్యి బీడీలకు,పెరిగిందని తెలిపారు. ఈ పెరిగిన, కరువు భత్యం 2024 ఏప్రిల్ 01 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం(విడిఏ) రూ.11.30 పైసలు గాను పెరిగి రూ.245 రూపాయల 08 పైసలు అవుతుందన్నారు. అదికూడా 2024 ఏప్రిల్ 01 నుండి అమలు చేయాలని తెలిపారు. నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ సార్టర్, ఆకు, తంబాకు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టీవాల, చెన్నీవాల, గంపవాల, వాచ్ మెన్ లకు నెలకు రూ.339 రూపాయల చొప్పున పెంచి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ ప్యాకర్లకు ఒక్కరోజు పనికి రూ.11 రూపాయల 30 పైసలు చొప్పున వివిధ రకాల నమూన బీడీ ప్యాకింగ్ కలిగిన లక్ష బీడీ ప్యాకింగుకు కరువు భత్యం ఎంత అనేది నిర్ణయించబడుతుందని తెలియజేశారు. పెరిగిన కరువు భత్యం రాష్ట్రంలోని 8 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. కాబట్టి పెరిగిన కరువు భత్యం అమలు చేయించుటకు పోరాడాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ రాష్ట్ర కమిటీ బీడీ కార్మికులందరికీ పిలుపునిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం నిజామాబాదు జిల్లా కార్యదర్శి, స్తెయ్యద్, బిఎల్ టీయూ, నాయకులు, జి,యదయ్య,జె,విశ్వనాథం,,బీడీ యూనియన్, నాయకురాలు, జి,లక్ష్మి, సి,హెచ్, విజయలక్ష్మి, చెలిమెల పుప్పా, తదితరులు పాల్గొన్నారు.