ప్రకృతి మీద అవగాహన కల్పించే సింబా

ప్రకృతి మీద అవగాహన కల్పించే సింబాఅనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్‌ నంది టీం వర్క్స్‌, రాజ్‌ దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్ల మీద సంపత్‌ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్‌ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 9న రిలీజ్‌ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత రాజేందర్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
సంపత్‌ నంది ఇంత వరకు కమర్షియల్‌ కాన్సెప్ట్‌లు రాశారు. కానీ ఈ మూవీని సైఫై థ్రిల్లర్‌గా రాశారు. ఇంత వరకు ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. సెన్సార్‌ వాళ్లు కూడా అభినం దించారు. సినిమాకు అవార్డులు కూడా వస్తాయని చెప్పారు. సంపత్‌ నంది వద్ద మురళీ మనోహర్‌ ఎన్నో చిత్రాలకు పని చేశారు. ఆయన లండన్‌లో ఫిల్మ్‌ స్కూల్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను ఆయనకు ఇచ్చాం.

జగపతిబాబుతో నాకు 25 ఏళ్ల నుంచి బంధం ఉంది. జగపతి బాబు ఇంట్లో పచ్చదనమే కనిపిస్తుంది. ఈ కథకు ఆయన ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారు. ఎంతో డెడికేటెడ్‌గా పని చేశారు. ప్రస్తుతం మనం ఎలాంటి కాలుష్య వాతావరణంలో ఉన్నామో చెప్పాల్సిన పని లేదు. ప్రకతి మీద అవగాహన, పర్యావరణ పరిరక్షణ అవసరం ఎంత ఉంది? అని ఇందులో చెప్పాం. కమర్షియల్‌ అంశాలను మేళవించి ఈ కథను చెప్పాం. రెండు వందల థియేటర్లలో ‘సింబా’ను రిలీజ్‌ చేస్తున్నాం. ఈనెల 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాను.
నేను ప్రకృతి ప్రేమికుడిని. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమంలో నేనూ పాల్గొన్నాను. మా టీజర్‌ చూసి సంతోష్‌ కుమార్‌ టీం మమ్మల్ని పిలిచింది. ఆ టైంలో ఆ ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తోంది. సమాజ శ్రేయస్సు కోసం, సమాజానికి ఉపయోగపడే చిత్రాలే చేస్తాను.