నవతెలంగాణ – సిరిసిల్ల
దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ , ట్రై సిరీస్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్ రావు ఎంపికయ్యారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ కు చెందిన అరవెల్లి అవనీష్ రావుకు చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.