శీర్లవంచ కృష్ణమాచార్యులకు డాక్టరేట్ ప్రధానం ..

Sirlavancha Krishnamacharya receives Doctorate Pradhan..నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శీర్లవంచ కృష్ణమాచార్యులు కులాలకతీతంగా పిల్లలకు సంస్కృత వేద విద్యను బోధిస్తున్నందుకుగానూ గ్లోబల్ హుమెన్ రైట్స్ ట్రస్ట్ వారు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నివాసంలో మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ రామకృష్ణ వేదిక వైదిక ధర్మ పీఠం, వైదిక స్మార్త అగమన వేద సంస్కృత పాఠశాలను స్థాపించి అందులో కులాలకతీతంగా ప్రతి కులానికి చెందిన పిల్లలు సంస్కృత వేద విద్యను నేర్చుకోవాలనుకునే వారికి వేద విద్యను బోధిస్తూ సేవలు అందిస్తున్నందుకు గాను గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో తనకు డాక్టరేట్ను ప్రధానం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతం, వేదాన్ని నేర్చుకునేందుకు అర్హులేనని ఆ ఉద్దేశంతోనే తాను శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం, వైదిక స్మార్త అగమ వేద సంస్కృత పాఠశాలను స్థాపించి పిల్లల తల్లిదండ్రుల ఆజ్ఞానుసారం పిల్లలు సంస్కృతం, వేదాన్ని అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఉచితంగా సంస్కృత, వేద విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.