ఖాజీపూర్ ముదిరాజులకు సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలి

నవతెలంగాణ – తొగుట
ఖాజీపూర్ ముదిరాజులకు సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలని మండల అధ్యక్షుడు ఉల్లెంగల సాయి కుమార్ ముదిరాజ్ తెలిపారు. శనివారం జీవో నెంబర్ 98/1964 ప్రకారం తెలంగాణ ముదిరాజ్ మహా సభల ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామ ముదిరాజులకు సొసైటీ ఎన్నికల తో పాటు నూతన సభ్యత్వాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మన్ చౌదరి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ల కార్యనిర్వాహన కార్యదర్శి దమ్మిగారి కనకయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు యమ ధర్మా, తొగుట మండల అధ్యక్షుడు ఉల్లెంగల సాయికుమార్, దుబ్బాక మండల అధ్యక్షుడు తోట్ల మల్లేశం, దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మడ బోయన రాజు, ఖాజీపూర్ ముదిరాజ్ సంఘం నాయకులు రమేష్, జంగిటి మలయ్య తదితరులు పాల్గొన్నారు.