సమాజానికి మీ సేవలు అవసరం

సమాజానికి మీ సేవలు అవసరం– సంధ్యారాగం సినిమా దర్శకుడు శ్రీనివాస్‌ నేదునూరికి ఉగాది పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-హైదరాబాద్‌
వివిధ రంగాల్లో నిష్ణాతులైన సుమారు 40 మంది కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులు, సినీ ప్రముఖులు తదితరులకు విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఆధ్వ్యర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. బేగంపేటలోని ప్లాజా హోటల్లో సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పెరుగు శ్రీసుధ ముఖ్యతిథిగా హాజరై ఉగాది పురస్కారాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్‌ లక్ష్మీకాంతం, పాఠశాల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ మదన్‌ మోహన్‌, పారిశ్రామిక వేత్త ఆర్క్‌గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినిమా విభాగంలో సంధ్యారాగం సినిమా దర్శకుడు శ్రీనివాస్‌ నేదునూరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ నేదునూరి మాట్లాడుతూ తన రచనలను, సంధ్యారాగం సినిమాను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ జ్యూరి కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత సామాజిక బాధ్యతను పెంచిందన్నారు. సీనియర్‌ సినిమా జర్నలిస్ట్‌ వినాయకరావు, ప్రైమ్‌ 9 న్యూస్‌ చైర్మెన్‌ బండి శ్రీనివాస్‌, సామాజిక సేవలో బి. విజరుకుమార్‌, లయన్‌ బీవీఎస్‌ రావు, డాక్టర్‌ ఎస్‌ఎన్వీ సుబ్బారావు, కోన శ్రీనివాసరావు, ఎం.ఎస్‌ విజయ కుమార్‌, భవాని, వినోద్‌, వ్యాపార వేత్త, నిశ్చయం గ్రూప్‌ సీఈవో విష్ణుప్రియ తదితరులున్నారు.